భారతదేశం, ఆగస్టు 3 -- ఫలితాల సీజన్ ఊపందుకున్న వేళ, భారత డిజిటల్ కామర్స్ రంగంలో కీలకమైన ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ దిగ్గజాలు ఎటర్నల్ లిమిటెడ్ (జొమాటో మాతృ సంస్థ), స్విగ్గీలు తమ ఏప్రిల్-జూన్ త్రైమాసిక (Q1FY27) ఆర్థిక ఫలితాలను వెల్లడించాయి. ఫలితాల ప్రకటన అనంతరం సోమవారం ట్రేడింగ్‌లో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) వేదికగా ఇటర్నల్ షేరు 1.69 శాతం పెరిగి రూ.303.50 వద్ద, స్విగ్గీ షేరు స్వల్ప లాభంతో రూ.286.40 వద్ద నిలిచాయి.

జొమాటో మాతృ సంస్థ అయిన ఎటర్నల్, ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో నికర లాభంలో వార్షిక ప్రాతిపదికన (YoY) ఏకంగా 268 శాతం వృద్ధి నమోదు చేసి రూ.92 కోట్లు ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.25 కోట్లు మాత్రమే. అయితే, ముందటి త్రైమాసికంతో (Q4FY26లో రూ.174 కోట్లు) పోలిస్తే లాభం 47.1 శాతం తగ్గుముఖంట్టింది.

కంపెనీ నిర్వహణ ...