భారతదేశం, జూలై 10 -- ఉద్యోగం మారడం వల్ల మెరుగైన జీతం, కెరీర్‌లో ఎదుగుదల, కొత్త అవకాశాలు లభిస్తాయి. కానీ, ఆదాయపు పన్ను రిటర్నుల (ITR) దాఖలు విషయానికి వచ్చేసరికి ఇది కొంత గందరగోళానికి దారితీస్తుంది. మీరు ఆర్థిక సంవత్సరం (FY) 2025-26లో ఒకటి కంటే ఎక్కువ కంపెనీల్లో పనిచేసి ఉంటే, అసెస్‌మెంట్ ఇయర్ (AY) 2026-27 ఐటీఆర్ ఫైలింగ్‌లో అన్ని కంపెనీల నుంచి వచ్చిన జీతం వివరాలను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. పాత యాజమాన్యం ద్వారా వచ్చిన ఆదాయాన్ని నమోదు చేయడం మర్చిపోతే పన్ను లెక్కింపుల్లో తప్పులు దొర్లడం, పన్ను బాకీలు పడటం, రీఫండ్‌లు ఆలస్యం కావడం లేదా ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు రావడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.

ఇన్‌కం టాక్స్ రిటర్న్ దాఖలు చేయడానికి ముందు ఉద్యోగులు కొన్ని కీలకమైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

పన్ను రిటర్నులు సమర్పించడానికి ముందు.. మీరు...