భారతదేశం, జూన్ 4 -- ఐటీల్లో (IIT) సీటు సాధించడం ఎంతోమంది విద్యార్థుల కల. కానీ, రాజస్థాన్‌లోని పఠాన్‌వాలా అనే ఒక చిన్న గ్రామానికి చెందిన ఇందర్‌జీత్ ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయం ఎందరికో ఆదర్శం. తండ్రి ఈ-రిక్షా నడుపుతూ ఏడాదికి లక్ష రూపాయల కంటే తక్కువ సంపాదిస్తున్నా, తల్లి గృహిణి అయినా, ఇందర్‌జీత్ తన లక్ష్యం వైపు అడుగులు వేసి జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్షలో OBC-NCL కేటగిరీలో 1040వ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో (CRL) 4861వ ర్యాంక్ సాధించాడు.

ఈ సందర్భంగా ఇందర్‌జీత్ తన విజయ ప్రస్థానం, పడిన కష్టాలు, చదువుకున్న విధానాన్ని పంచుకున్నాడు.

ఇందర్‌జీత్ స్వగ్రామంలో కనీస నీటి వసతి, డ్రైనేజీ, వైద్య సదుపాయాలు కూడా సరిగ్గా లేవు. గ్రామంలో ఎవరికీ జేఈఈ, నీట్ గురించి తెలియదు. ఒకరోజు కొందరు సీనియర్లు మాట్లాడుకుంటుండగా విని, స్మార్ట్‌ఫోన్‌లో "జేఈఈ అంటే ఏమిటి?",...