భారతదేశం, మే 27 -- హిందూ సంప్రదాయంలో అధికమాసానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. దీనిని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. ఈ నెల మొత్తం భక్తి శ్రద్ధలతో గడిపినప్పటికీ, ఈ ఐదు రోజులు అంటే ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు వచ్చే తిథులు అత్యంత శక్తివంతమైనవి.

ఈ సమయంలో చేసే స్నాన, దానాలు, జపాలకు వెయ్యి రెట్లు ఎక్కువ ఫలితం దక్కుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కేవలం విష్ణువు అనుగ్రహమే కాకుండా, మీ జాతకంలో గ్రహ దోషాలను తొలగించుకోవడానికి, లక్ష్మీదేవి ఆశీస్సులు పొందడానికి ఈ రోజులు గొప్ప అవకాశం కల్పిస్తాయి.

అధికమాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని పద్మిని ఏకాదశి లేదా కమల ఏకాదశి అంటారు. మే 27వ తేదీ బుధవారం ఉదయం 06:22 గంటల వరకు ఏకాదశి తిథి ఉంటుంది, ఆ తర్వాత ద్వాదశి ప్రారంభమవుతుంది. ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల దారిద్య్రం త...