భారతదేశం, ఆగస్టు 17 -- శ్రావణ మాసంలో శుక్ల పంచమి తిథిని అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 17న సోమవారం రోజున నాగ పంచమి పర్వదినం వచ్చింది. ఈ విశేషమైన రోజున భోళా శంకరుడితో పాటు నాగ దేవతలను పూజిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి.

ముఖ్యంగా శ్రావణ సోమవారంతో కలిసిరావడం వల్ల ఈ రోజంతా శివనామస్మరణతో మార్మోగుతోంది. ఈ పవిత్ర దినాన శని, రాహు-కేతువుల దుష్ప్రభావాలను తగ్గించుకోవడానికి, అదృష్టాన్ని ఆకర్షించడానికి జ్యోతిష్య శాస్త్రం కొన్ని అద్భుతమైన మార్గాలను సూచించింది. జ్యోతిష్య నిపుణుల ప్రకారం ప్రతి రాశి వారూ తమ జన్మరాశిని బట్టి పూజా విధానాలను ఆచరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

మేష రాశి: ఈ రాశి వారు నాగ పంచమి నాడు శివలింగానికి చందనం కలిపిన జలాన్ని సమర్పించాలి. అలాగే నాగ దేవతకు శెనగలను నైవేద్యంగా సమర్పిస్తే జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి....