భారతదేశం, జూలై 3 -- కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల సామాజిక భద్రత, ప్రయోజనాల కోసం కొత్త ఈపీఎఫ్ నిబంధనలను (EPF Scheme 2026) తీసుకువచ్చింది. జూన్ 29, 2026న నోటిఫై చేసిన ఈ కొత్త పథకం ప్రకారం.. నెలకు రూ. 1,800 పరిమితి దాటిన ప్రావిడెంట్ ఫండ్ (PF) కంట్రిబ్యూషన్‌ను ఇకపై 'ఐచ్ఛికం' (Voluntary)గా పరిగణించనున్నారు. ఈ కొత్త నిర్ణయం అటు కంపెనీలకు, ఇటు భారీ జీతాలు తీసుకునే ఉద్యోగులకు స్పష్టతనిచ్చింది. అయితే, పీఎఫ్ కంట్రిబ్యూషన్ రేటు, ప్రాథమిక వేతన పరిమితి, వార్షిక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.

పాత 1952 నాటి ఈపీఎఫ్ చట్టం స్థానంలో, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 'సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020' అమలులో భాగంగా ఈ కొత్త 2026 స్కీమ్‌ను అమల్లోకి తెచ్చారు. ఇది చట్టపరమైన నిబంధనలను ఆధునీకరించడానికి ఉద్దేశించినదే తప్ప, ఉద్యోగుల హక్కులను తగ్గించేది కాదు.

పీఎఫ్ నిబ...