భారతదేశం, జూలై 3 -- ఉద్యోగులకు దీర్ఘకాలిక పెట్టుబడి, ఆర్థిక భద్రతను అందించే అత్యుత్తమ సాధనాల్లో ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఒకటి. చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం.. పీఎఫ్ చందాదారులు అత్యవసర సమయాల్లో తమ ఖాతా నుండి పాక్షికంగా లేదా ఉద్యోగం వదిలేసిన తర్వాత పూర్తిగా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే, పీఎఫ్ విత్‌డ్రాయల్స్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు చాలా మంది క్లెయిమ్‌లు రిజెక్ట్ అవుతుంటాయి.

తాజాగా కేంద్ర ప్రభుత్వం 'సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020' అమలులో భాగంగా ఈ వారమే కొత్త ఈపీఎఫ్ స్కీమ్ 2026 (EPF Scheme 2026) ను తీసుకువచ్చింది. ఇది 1952 నాటి పాత పథకం స్థానంలో అమల్లోకి వచ్చింది.

కొత్త నిబంధనల ప్రకారం.. పీఎఫ్ ఖాతా నుండి పాక్షికంగా (Partial Withdrawal) డబ్బులు విత్‌డ్రా చేసుకునే నిబంధనలలో మార్పులు చేశారు. ఇకపై చందాదారులు తమ పీఎఫ్ ఖాతాలో ఎల్లప్పుడూ ...