భారతదేశం, మే 23 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో రామరాజు కుటుంబం రెండుగా చీలిపోయినందుకు శ్రీవల్లి తెగ సంబరపడిపోతుంది. తను చేసిన పనికి పాలాభిషేకం వంటివి చేయొద్దని సుకన్య అంటుంది. దాంతో సుకన్య చేయి విరుస్తుంది భాగ్యం. నేను నర్మదను బయటకు పంపించేందుకు ప్లాన్ వేస్తే ఇది చెడగొట్టిందని భాగ్యం అంటుంది.

నువ్వు పాత పద్ధతిలో ప్లానింగ్ చేస్తున్నావ్. మేము యూత్ కాబట్టి ట్రెండింగ్ తగినట్లు ప్లాన్ చేస్తాం. ఇప్పుడు నర్మదను వేరు కాపురం పెట్టించడం కూడా అలాంటి ప్లానింగే. ఇకనుంచి నర్మదకు కంట్లోంచి కన్నీళ్లు తప్పా నోట్లోంచి మాట కూడా బయటకు రాదు అని శ్రీవల్లి అంటుంది.

తర్వాత రాత్రి ఇంట్లో గీసిన గీతను చూసి కుమిలిపోతాడు రామరాజు. కిందపడిన బొమ్మలను చూస్తూ బాధపడుతాడు. వాటిని చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తాడు రామరాజు. ...