భారతదేశం, మార్చి 24 -- వాషింగ్టన్/టెహ్రాన్: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగాయి. ఇరాన్‌పై యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇరాన్ ఇంధన వనరులు, విద్యుత్ కేంద్రాలపై దాడులను ఐదు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు (Suspension) ట్రంప్ ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే, ఈ ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే ఇజ్రాయెల్ దళాలు (IDF) టెహ్రాన్ గుండెల్లో బాంబుల వర్షం కురిపించడం గమనార్హం.

"ఇరాన్ పవర్ ప్లాంట్లు, ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ఎలాంటి దాడులు చేయవద్దు" అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఆదేశించారు. ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయని, సమస్యల పరిష్కారానికి అవకాశం ఉందని ఆయన సంకేతాలిచ్చారు. కానీ, ట్రంప్ పోస్ట్ పెట్టిన గంటలోపే టెహ్రాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్...