భారతదేశం, ఏప్రిల్ 4 -- పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పరాకాష్టకు చేరాయి. ఇరాన్‌లోని అత్యంత కీలకమైన పెట్రోకెమికల్ హబ్‌లపై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత విరుచుకుపడ్డాయి. నైరుతి ఇరాన్‌లోని మాహ్‌షహర్ ప్రత్యేక పెట్రోకెమికల్ జోన్‌తో పాటు బందర్ ఇమామ్ సముదాయాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల వల్ల భారీ శబ్దాలతో పేలుళ్లు సంభవించాయని, పలు కంపెనీలు దెబ్బతిన్నాయని ఇరాన్ స్థానిక మీడియా వెల్లడించింది.

"మాహ్‌షహర్ ప్రత్యేక పెట్రోకెమికల్ జోన్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి" అని ఖుజెస్థాన్ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్‌ను ఉటంకిస్తూ ఫ్రాన్స్ వార్తా సంస్థ ఏఎఫ్‌పీ తెలిపింది.

అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన ఈ సంయుక్త దాడుల్లో ఆ ప్రాంతంలోని అబూ అలీ, రిజాల్, అమీర్ కబీర్ పెట్రోకెమికల్ కంపెనీలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయ...