భారతదేశం, మార్చి 25 -- ముంబై: భారత స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల జాతరను జరుపుకున్నాయి. వరుసగా రెండో రోజు కూడా ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిసింది. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ. 8 లక్షల కోట్లు పెరిగింది. సెన్సెక్స్ ఒక దశలో 1,200 పాయింట్లు (1.6%) ఎగబాకి 75,230 మార్కును తాకగా, నిఫ్టీ 50 ఇండెక్స్ 400 పాయింట్లు లాభపడి 23,287 స్థాయికి చేరుకుంది.

కేవలం దిగ్గజ కంపెనీలే కాకుండా మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ షేర్లు కూడా 2 శాతానికి పైగా లాభపడటం మార్కెట్లోని ఉత్సాహానికి నిదర్శనం. ఇంత భారీ స్థాయిలో మార్కెట్లు పెరగడానికి ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి.

మార్కెట్లలో జోరుకు ప్రధాన కారణం అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సడలడమే. ఇరాన్ ఇంధన క్షేత్రాలపై దాడులను ఐదు రోజుల పాటు నిలిపివేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప...