భారతదేశం, జూన్ 16 -- భారతీయ రిటైల్ ఇన్వెస్టర్లకు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు సరికొత్త మార్గం సుగమమైంది. దేశంలోని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలైన జెరోధా, గ్రో, ఏంజెల్ వన్, అప్‌స్టాక్స్‌లు గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీ (GIFT City) ద్వారా యూఎస్, అంతర్జాతీయ షేర్లలో పెట్టుబడి సేవలను అందించేందుకు అధికారిక అనుమతులు సాధించాయి. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (IFSCA) ఈ ప్లాట్‌ఫారమ్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాంకేతిక అనుసంధానం, నిబంధనల ప్రక్రియలు పూర్తి చేసుకుని రాబోయే రెండు నుంచి మూడు నెలల్లో ఈ సేవలు పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయి.

ఈ అనుమతుల ద్వారా భారతదేశంలోని అతిపెద్ద నాలుగు రిటైల్ బ్రోకరేజ్ ప్లాట్‌ఫారమ్‌లు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోకి ప్రవేశించేందుకు వీలు కలుగుతుంది. గిఫ...