భారతదేశం, జూన్ 15 -- మహారాష్ట్రలోని పూణేలో ఆదివారం(జూన్ 15) పెద్ద ప్రమాదం జరిగింది. ఇంద్రాయణి నదిపై నిర్మించిన వంతెన సగం కూలిపోయింది. వంతెన కూలిపోయినప్పుడు వంతెనపై చాలా మంది ఉన్నారు. నదిలో దాదాపు 25 నుండి 30 మంది కొట్టుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. ఈ లెక్క తెలియాల్సి ఉంది.
పూణేలోని మావల్లోని కుండ్ మాల్ వద్ద వంతెన కూలిపోవడంతో కొంతమంది పర్యాటకులు మునిగిపోయారు. ఈ సంఘటన మధ్యాహ్నం 3.40 గంటల ప్రాంతంలో జరిగిందని చెబుతున్నారు. కూలిపోయిన వంతెన భాగంలో రాళ్లు ఉన్నాయి. రాళ్లపై పడిన వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. అదే సమయంలో చాలా మంది నది ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఇద్దరు మరణించారు.
పింప్రి-చించ్వాడ్ పోలీస్ కమిషనరేట్కు చెందిన తలేగావ్ దభాడే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంద్రాయాణి నదిపై నిర్మించిన ఇనుప వంతెన 30 ఏళ్ల నాటిదని మావల్ ఎమ్మెల్యే ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.