భారతదేశం, సెప్టెంబర్ 3 -- తెలంగాణ హౌసింగ్ బోర్డు.. క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ హౌసింగ్ టవర్స్‌లో ఇళ్ల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేసింది. ఇటీవల నిర్వహించిన లక్కీ డ్రా ద్వారా ఎంపికైన అర్హులైన లబ్ధిదారుల జాబితాపై ప్రజలు తమ అభ్యంతరాలను (Objections) తెలియజేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించింది. లాటరీ ద్వారా ఎంపికైన అభ్యర్థులలో ఎవరైనా అనర్హులు ఉన్నా, డూప్లికేట్ ఎంట్రీలు ఉన్నా లేదా నిబంధనలు ఉల్లంఘించి ప్లాట్లు పొందినా, వారిపై అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని హౌసింగ్ బోర్డు తెలిపింది.

అధికారిక వెబ్‌సైట్ tghb.telangana.gov.in పోర్టల్‌ను సందర్శించి, ఎంపికైన లబ్ధిదారుల వివరాల పక్కన ఉన్న 'Object' (అభ్యంతరం) ఆప్షన్‌పై క్లిక్ చేసి తమ ఫిర్యాదును నమోదు చేయవచ్చు. అభ్యంతరాలను సమర్పించడానికి సెప్టెంబర్ 4 ను చివరి తేదీగా గృహనిర్మాణ మండల...