భారతదేశం, మార్చి 2 -- పోలవరం ప్రాజెక్టు పునరావాస ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. పోలవరం జిల్లాలోని ముంపునకు గురయ్యే మండలాలైన వీఆర్‌పురం, కూనవరం, చింతూరు మండలాల నుంచి నిర్వాసితులైన కుటుంబాలను తరలించేందుకు అధికారులు ఏర్పా్ట్లు చేస్తున్నారు.

మొదటి దశలో 1,000 కుటుంబాలను ఏలూరు జిల్లాలోని తాడ్వాయికి తరలిస్తామని అధికారులు ప్రకటించారు. అక్కడ ప్రస్తుతం స్థల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రాబోయే రెండు వారాల్లో నిర్వాసిత కుటుంబాలకు 1,000 ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయడానికి ప్రతిపాదనలు రూపొందించినట్టుగా సమాచారం. 41.15(బి) కాంటూర్ స్థాయి కిందకు వచ్చే కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాల్లో ముంపు ప్రభావం గణనీయంగా ఉంది.

ఈ మూడు మండలాల్లో దశలవారీగా తరలింపు కోసం మొత్తం 14,000 కుటుంబాలను గుర్తించారు. అభ్యంతరాలు, ధృవీకరణ సమస్యల కారణంగా దాదాపు 4,000 కేసులు ఇప్...