భారతదేశం, మార్చి 1 -- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బి.ఆర్.నాయుడు స్పందించారు. బీఆర్ నాయుడు ఆ దృశ్యాలను కల్పితంగా కొట్టిపారేశారు. తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన ఒక బహిరంగ ప్రకటనలో, ఆ వీడియోలు ఏఐ టెక్నాలజీ ఉపయోగించి రూపొందించినట్టుగా వెల్లడించారు. తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు, తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రతిష్టను దెబ్బతీసేందుకు తయారు చేసి వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు.. డీప్ పేక్ అని, కొంతమంది తనను అప్రతిష్టపాలు చేయడానికి లక్ష్యంగా చేసుకున్న ప్రచారాన్ని చేస్తున్నారని బీఆర్ నాయుడు ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వైరల్ చేయడం వెనక ఉన్నారని ప్రత్యేకంగా ఆరోపించారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు.. మహిళలతో...