భారతదేశం, జనవరి 20 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రమాద మరణ బీమాను రూ.10 లక్షలకు పెంచడం ద్వారా మత్స్యకారుల కుటుంబాలకు పెద్ద ఉపశమనాన్ని కల్పించింది. జీవనం కోసం పూర్తిగా చేపలు పట్టడంపై ఆధారపడిన కుటుంబాలను రక్షించడం ఈ నిర్ణయం లక్ష్యంగా ప్రభుత్వం చెబుతోంది.
ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్వై) కింద రాష్ట్రం బీమా మొత్తాన్ని రూ.2 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచింది. సముద్రంలో చేపలు పట్టేటప్పుడు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు ఈ మెుత్తం అందుతుంది.
గతంలో కుటుంబాలు రూ.2 లక్షల వరకు పరిహారంగా పొందాయి. అయితే ఈ మొత్తం సముద్ర చేపల వేటలో కలిగే నష్టాలకు సరిపోలడం లేదని ప్రభుత్వం భావించింది. రూ.10 లక్షల బీమా చేపలు పట్టడం సంబంధిత ప్రమాదాలకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. సహజ కారణాలు లేదా ఇతర సంఘటనల కారణంగా మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.