భారతదేశం, నవంబర్ 22 -- భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బి.ఆర్. గవాయ్ సుమారు ఆరు నెలల పదవీకాలంలో దేశంలోని హైకోర్టులకు వెనుకబడిన తరగతులు (BC), ఇతర వెనుకబడిన తరగతులు (OBC) నుంచి ఏకంగా 11 మంది న్యాయమూర్తులు నియమితులయ్యారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ఆయన తీసుకున్న ఈ నిర్ణయం న్యాయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది.
దేశంలోనే మొట్టమొదటి బౌద్ధ, రెండవ దళిత సీజేఐగా జస్టిస్ గవాయ్ పేరు పొందారు. ఆయన నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం వివిధ హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకానికి గాను 129 మంది పేర్లను ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఇందులో 93 పేర్లను కేంద్రం ఆమోదించింది.
సుప్రీంకోర్టు వెబ్సైట్లో మే 14వ తేదీ నుంచి జస్టిస్ గవాయ్ సీజేఐగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చేసిన నియామకాల వివరాలను పొందుపరిచారు. కేంద్రం ఆమోదించిన 93 మంది హైకోర్టు న్యాయమూర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.