భారతదేశం, మే 11 -- ఆయుష్ వైద్య సేవల్లో మ‌రింత నాణ్యత‌ పెంచేందుకు, మరింత విస్తృతం చేసేందుకు, నకిలీ వైద్యానికి కళ్లెం వేసేందుకు ముఖ్యమైన మార్పులు తీసుకురానున్నామ‌ని వైద్యరోగ్య శాఖ మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్ తెలిపారు. సంప్రదాయ ఆయుర్వేద, హోమియో, సిద్ధ, యూనాని, నేచురోపతి(ఆయుష్‌) వైద్యానికి మరింత ప్రాచుర్యాన్ని తెచ్చేందుకు, ప్రజలకు చేరువ చేసేందుకు వీలుగా నియంత్రణ వ్యవస్థను పటిష్టం చేయనున్నట్లు వెల్లడించారు.

ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ అల్లోపతిక్ ప్రైవేట్‌ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్‌(రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) చట్టం-2022కు సవరణ చేశామ‌ని మంత్రి సత్యకుమార్ అన్నారు. చట్టసభల ద్వారా ఈ బిల్లుకు లభించిన ఆమోదానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో కొత్త విధివిధానాలు రాబోతున్నాయ‌ని తెలిపారు. ఈ క్రమంలో విధివిధానాల రూపకల్పనకు మూడు ప్రత్యేక కమ...