భారతదేశం, ఏప్రిల్ 24 -- దేశ రాజధాని రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు, ఆ పార్టీ గళంగా ముద్రపడిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా చివరకు కేజ్రీవాల్కు షాక్ ఇచ్చారు. తనతో పాటు మరో ఆరుగురు రాజ్యసభ సభ్యులను కలుపుకుని కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీలో విలీనమయ్యారు. ఈ పరిణామం ఆప్ ఉనికిని రాజ్యసభలో ప్రశ్నార్థకం చేయడమే కాకుండా, పంజాబ్ రాజకీయాల్లో కూడా పెను మార్పులకు నాంది పలికేలా కనిపిస్తోంది.
రాఘవ్ చద్దా తన సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ 'విలీనం' (Merge) అనే పదాన్ని ప్రత్యేకంగా నొక్కి చెప్పారు. దీని వెనుక బలమైన రాజ్యాంగ కారణం ఉంది. భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ (ఫిరాయింపుల నిరోధక చట్టం) ప్రకారం, ఏ పార్టీకి చెందిన సభ్యులైనా వ్యక్తిగతంగా రాజీనామా చేసి వేరే పార్టీలో చేరితే వారి పదవి పోతుంది....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.