భారతదేశం, జూలై 20 -- హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీ పరిధిలో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డి వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. కేసు నమోదు, తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో ఆయన లేఖ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది.

హైదరాబాద్ శివార్లలోని జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న కర్ణాటకకు చెందిన ఓ ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిణి, తన బ్యాచ్‌మేట్ అయిన ఉదయ్‌కృష్ణారెడ్డిపై ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు. అకాడమీలో ఉదయ్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆమె అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మోతీనగర్‌లోని తన బంధువుల నివాసానికి వచ్చిన ఉదయ్‌కృష్ణారెడ్డి, శానిటైజర్ తాగి బలవన్మరణానికి ప్రయత్నించారు. అయితే ఆత్మహత్యాయత్నానికి ముందు ఆయన రాసిన ఒక లేఖ లభ్యమవడంతో ఈ కేసులో కొత్త కోణం వెలుగు...