భారతదేశం, ఫిబ్రవరి 19 -- ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టు అగ్రనేత, కార్యదర్శి దేవ్జీ సహా కీలక నేతలు ఈ ప్రాంతంలో ఉన్నారన్న పక్కా సమాచారంతో బలగాలు వెళ్లాయి. అగ్రనేతల కోసం 'ఆపరేషన్ కగార్-2'లో భాగంగా కూంబింగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు అగ్ర నేతలు ఉన్నట్టుగా సమాచారం. ఆపరేషన్ కగార్ 2 పేరుతో కర్రెగుట్టలో భద్రతా బలగాల కూంబింగ్ చేస్తున్నాయి. మావోయిస్టు అగ్ర నేతలే టార్గెట్గా ఆపరేషన్ కగార్ 2 నడుస్తోంది. ఆపరేషన్ కగార్ డెడ్లైన్ ఇంకా 40 రోజులే మిగిలి ఉంది. దీంతో ఐదు వేల మంది సీఆర్పీఎఫ్ బలగాలతో కూంబింగ్ చేస్తున్నాయి.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.