భారతదేశం, ఫిబ్రవరి 24 -- హైదరాబాద్ పోలీసులు దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్న సైబర్ ముఠా గుట్టురట్టు చేశారు. 16 రాష్ట్రాలలో 104 మంది అరెస్టు చేశారు. రూ.36 లక్షల నగదు, 200కుపైగా మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ (సైబర్ క్రైమ్స్) అరవింద్ బాబు నాయకత్వంలో హైదరాబాద్ నగర పోలీసులు 16 రాష్ట్రాలలో సమన్వయంతో ఆపరేషన్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న సైబర్ క్రైమ్ సిండికేట్లపై భారీ ఎత్తున దాడి చేశారు.

'ఆపరేషన్ ఆక్టోపస్' పేరుతో ఈ దాడి జరిగింది. దేశవ్యాప్తంగా సైబర్ మోసాల నెట్‌వర్క్‌లను నిర్వీర్యం చేయడంలో ఈ ఆపరేషన్ భాగం. ఇటీవలి కాలంలో పెట్టుబడి మోసాలు, ట్రేడింగ్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ మోసాలకు బాధితులు బలైపోతున్న కేసులు పెరిగాయి. ఫలితంగా వారు కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోతున్నారు. సైబర్ మోసగాళ్ళు.. బెదిరింపులు, ఎమోషనల్ బ్లాక్‌మెయి...