భారతదేశం, ఏప్రిల్ 19 -- Hyderabad Police Operation Octopus 2.0 : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సైబర్ మోసగాళ్ల నెట్‌వర్క్‌పై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. తొమ్మిది రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించిన పోలీసులు.. బ్యాంకింగ్ అధికారులే సూత్రధారులుగా సాగుతున్న భారీ సైబర్ మోసాల ముఠాను గుట్టురట్టు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ 'ఆపరేషన్ ఆక్టోపస్ 2.0' వివరాలను వెల్లడించారు.

'ఆపరేషన్‌ ఆక్టోపస్‌-2.O' పేరుతో నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్‌లో మొత్తం 9 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి, బ్యాంకు అధికారులు సహా 52 మంది నిందితులను అరెస్టు చేశారు. పెట్టుబడి స్కామ్‌లు, ట్రేడింగ్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ పేరుతో అమాయకులను బెదిరించి భారీగా సొమ్ము దోచుకుంటున్న ముఠాలకు అండగా నిలుస్తున్న బ్యాంకు అధికారులే లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగింది.

నిందితుల...