భారతదేశం, సెప్టెంబర్ 2 -- తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో మెండు లోకనాథం ఇల్లు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేపట్టారు. ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి, బుధవారం ఉదయాన్నే మెరుపు దాడులు చేపట్టారు. ఈ పరిణామం తిరుమల తిరుపతి దేవస్థానాలు (టిటిడి) వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు ఉదయం 6 గంటల నుంచే ఏకకాలంలో సోదాలు ప్రారంభించాయి. తిరుపతిలోని పెద్దకాపు లేఅవుట్‌లో ఉన్న లోకనాథం నివాసంలో అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఆయన ఇంట్లోని ముఖ్యమైన పత్రాలు, బ్యాంక్ లాకర్లు, ఆస్తుల పత్రాలు, నగదు, బంగారానికి సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

సుదీర్ఘ కాలంగా టీటీడీలో కీలక బాధ్యతల్లో ఉన్న లోక...