భారతదేశం, సెప్టెంబర్ 2 -- దలాల్ స్ట్రీట్‌లో అడుగుపెట్టిన ప్రముఖ పసిడి, వెండి డిజిటల్ ప్లాట్‌ఫారమ్ కంపెనీ ఆగ్‌మాంట్ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు ట్రేడింగ్‌లో సందడి చేస్తున్నాయి. బుధవారం నాటి సెషన్‌లో ఎన్ఎస్ఈలో ఈ షేరు 5 శాతానికి పైగా లాభపడింది. మంగళవారం ముగింపు ధర రూ. 866.25తో పోలిస్తే బుధవారం రూ. 869.80 వద్ద ప్రారంభమైన షేరు ధర, ఇంట్రాడేలో రూ. 925.65 వద్ద గరిష్టాన్ని తాకింది.

ఆగ్‌మాంట్ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు సోమవారం రోజున మార్కెట్లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాయి. ఐపీఓ ఇష్యూ ధర రూ. 788తో పోలిస్తే దాదాపు 22 శాతం ప్రీమియంతో ఎన్ఎస్ఈలో రూ. 961 వద్ద (21.95% ప్రీమియం), బీఎస్ఈలో రూ. 956 వద్ద (21.32% ప్రీమియం) జాబితా అయ్యాయి. రూ. 825 కోట్ల విలువైన ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ రూ. 750 నుంచి రూ. 788గా ఉన్న సంగతి తెలిసిందే.

సెప్టెంబర్ 1న బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవా...