భారతదేశం, జూలై 21 -- భాషాభిమానులకు, రచయితలకు ఆంధ్ర సారస్వత పరిషత్తు ఒక మంచి అవకాశాన్ని ముందుకు తెచ్చింది. చిన్నారులను అలరించేలా, వారిలో తెలుగు భాష పట్ల మమకారాన్ని పెంచేలా 'బాలల గేయ రచన' పోటీలను నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ వెల్లడించారు. వచ్చే డిసెంబర్ 5, 6 తేదీల్లో ప్రకాశం జిల్లా ఒంగోలులోని నెక్ట్స్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ వేదికగా నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు కోలాహలంగా జరగనున్నాయి. ఈ చారిత్రాత్మక వేడుకలను పురస్కరించుకుని ఈ ప్రత్యేకమైన సాహితీ పోటీకి శ్రీకారం చుట్టారు.

తెలుగు భాషా వికాసానికి, బాల సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ఈ పోటీలకు సంబంధించిన కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఈ గేయ రచన పోటీలలో పాల్గొనడానికి ఎటువంటి వయోపరిమితి లేదు. సాహిత్యాభిమానులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎవరైనా ఇందులో భాగస్వాములు ...