భారతదేశం, మార్చి 1 -- ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలనే కొత్త విజ్ఞప్తి వచ్చింది. తెలుగునాడుగా మార్చాలని 3వ ప్రపంచ తెలుగు మహాసభ నుండి కొత్త స్వరం వినిపించింది. తమిళం మాట్లాడే రాష్ట్రాన్ని తమిళనాడును ఏర్పాటు చేశారు. కాబట్టి తెలుగు మాట్లాడేవారి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను తెలుగు నాడుగా మార్చాలని తెలుగు మహాసభలో రిక్వెస్ట్ వచ్చింది.

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలోని కిమ్స్‌ మెడికల్‌ కళాశాల ప్రాంగణంలో గోదావరి గ్లోబల్‌ యూనివర్సిటీ ఛైర్మన్‌ చైతన్యరాజు ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే తెలుగు మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, గరికిపాటి నరసింహారావు, చాగంటి కోటేశ్వరరావు, నటుడు తనికెళ్ల భరణి, పలువురు ప్రతినిధులు హాజరయ్యారు.

తెలుగు కేవలం ఒక భాష కాదని, మన సంస్కృతి, సంప్ర...