భారతదేశం, ఏప్రిల్ 19 -- ప్రైవేటు స్లీపర్ బస్సులు వరుసగా తీవ్ర ప్రమాదాలకు గురవుతున్న విషయం తెలిసిందే. నేపథ్యంలో ఈ ప్రమాదాల వెనుక గల కారణాలపై విచారణ జరపాలని, ప్రయాణికుల సురక్షిత ప్రయాణానికి అవసరమైన చర్యలపై సిఫార్సులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ అభ్యర్థన మేరకు.. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI) సమగ్ర దర్యాప్తు జరిపి, స్లీపర్ బస్సులను దశలవారీగా పూర్తిగా నిషేధించాలని సిఫార్సు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించింది.

రాష్ట్రంలో స్లీపర్ బస్సులపై నిషేధం విధించే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని ఇప్పటికే రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా పేర్కొన్నారు.

నివేదిక ప్రకారం.. వరుస ఘోర ప్రమాదాల నేపథ్యంలో స్లీపర్ బస్సులపై దశలవారీ నిషేధాన్ని విధించాలని ఏఎస్‌సీఐ సిఫార్సు చేస...