భారతదేశం, జూన్ 11 -- ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ తీవ్ర వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డీఎస్సీలో అర్హులకు తీవ్ర అన్యాయం జరిగిందని, స్పోర్ట్స్ కోటా పేరుతో బ్యాక్‌డోర్ అపాయింట్‌మెంట్లు ఇచ్చారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ డీఎస్సీకి సంబంధించిన ఆధారాలను, వివాదాస్పద జీవోల చిట్టాపై మాట్లాడారు. క్రీడా కోటా ఉద్యోగాల కేటాయింపును పూర్తిగా దళారీ వ్యవస్థగా మార్చేశారని వైఎస్ జగన్ ఆరోపించారు. జూడో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా మంత్రి లోకేష్ తోడల్లుడు భరత్, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా టీడీపీ నేత కూన రవికుమార్ ఉన్నారని.. వీరే నకిలీ సర్టి...