భారతదేశం, జూన్ 16 -- యువతలో క్రమశిక్షణ, దేశభక్తిని పెంపొందించే నేషనల్ క్యాడెట్ కార్ప్స్(ఎన్‌సీసీ) విస్తరణకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసింది. ఇందులో భాగంగా రెండు కొత్త స్వతంత్ర ఎన్‌సీసీ స్టేట్ డైరెక్టరేట్ల ఏర్పాటుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సరికొత్త డైరెక్టరేట్లలో ఒకటి ఆంధ్రప్రదేశ్‌కు లభించగా, మరొకటి జార్ఖండ్ రాష్ట్రానికి కేటాయించారు. తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం ఎన్‌సీసీ స్టేట్ డైరెక్టరేట్ల సంఖ్య 17 నుండి 19కి పెరిగింది.

ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రాల పరిధిలో లేదా పొరుగు రాష్ట్రాలతో కలిపి ఎన్‌సీసీ సాగేది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా స్వతంత్ర స్టేట్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయడం వల్ల క్యాడెట్లకు, విద్యాసంస్థలకు ఎన్‌సీసీ సేవలు మరింత చేరువవుతాయి. ఈ కొత్త పరిపాలనా నిర్మాణం, శిక్షణ, అభివృద్ధి క...