భారతదేశం, ఫిబ్రవరి 19 -- భారతదేశంలోని క్లీన్ ఎనర్జీ తయారీ రంగానికి పెద్ద ప్రోత్సాహకం దక్కనుంది. రూ.8,175 కోట్ల పెట్టుబడితో అనకాపల్లిలోని రాంబిల్లిలో భారతదేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ లిథియం-అయాన్ బ్యాటరీ గిగాఫ్యాక్టరీని స్థాపించడానికి వారీ ఎనర్జీస్ కట్టుబడి ఉంది. అధికారిక సమాచారం ప్రకారం ఇది 16 GWh సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సెల్ తయారీ, బ్యాటరీ ప్యాక్‌లు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌లతో సహా పూర్తి బ్యాటరీలకు సంబంధించిన విషయాలను ఈ ఫ్యాక్టరీ కవర్ చేస్తుంది.

ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర పెట్టుబడి ప్రమోషన్ బోర్డు(SIPB) నుండి సూత్రప్రాయంగా ఆమోదం లభించింది. పెట్టుబడిని స్వాగతిస్తూ మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర క్లీన్-ఎనర్జీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందన్నారు.

ఇది భారతదేశంలో అతిపెద్ద బ్యాటరీ తయారీ కర్మాగార...