భారతదేశం, జూన్ 15 -- తెలుగు రాష్ట్రాల గుండా ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అలర్ట్ జారీ చేసింది. కాజీపేట - కొండపల్లి సెక్షన్ పరిధిలోని డోర్నకల్, గుండ్రాతిమడుగుస్టేషన్ల మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణ పనుల్లో భాగంగా నాన్-ఇంటర్‌లాకింగ్ పనులు చేపట్టనున్నారు. ఈ ఇంజనీరింగ్ పనుల కారణంగా 2026 ఆగస్టు నెలలో పలు రైళ్లను పూర్తిగా, మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

ప్రయాణికులు రైలు రద్దు వివరాలను సరిచూసుకుని, ప్రయాణానికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ముందుగానే చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. దీనివల్ల కలిగే అసౌకర్యానికి దక్షిణ మధ్య రైల్వే చింతిస్తోందని పేర్కొంది.

రైలు నెంబర్. 67765 (కాజీపేట - డోర్నకల్), నెం. 67766 (డోర్నకల్ - కాజీపేట), నెం. 67767 (డోర్నకల్ - విజయవాడ), నెం. 6776...