భారతదేశం, ఫిబ్రవరి 24 -- ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అరటి పండ్ల ధరలు పెరుగుతున్నాయి. దీనికి కారణం పెళ్లిళ్ల సీజన్ వస్తుండటం, సరఫరా తగ్గడంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. మరో మూడు నెలలు ధరలు ఇలానే కొనసాగే అవకాశం ఉంది. డిసెంబర్‌లో ధరలు క్వింటాలుకు రూ.2,000-రూ.3,000 వరకు పడిపోయినప్పుడు రైతులు భారీ నష్టాలను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం రైతులకు ఈ పదునైన రికవరీ అవసరమైన ఉపశమనం కలిగించింది. ధరలు టన్నుకు రూ.25,000 కు పెరిగాయి.

ఈ-క్రాప్ డేటా ప్రకారం కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గంలో అరటి సాగు అత్యధికంగా ఉంది. 13,820 హెక్టార్లలో పంట సాగు చేశారు. రైతులు సాధారణంగా ఎకరానికి దాదాపు రూ.1.5 లక్షలు పెట్టుబడి పెడతారు. దిగుబడి 15 నుండి 20 టన్నుల మధ్య ఉంటుంది.

కాలానుగుణ పంటల మాదిరిగా కాకుండా, అరటిపండ్లను ఏడాది పొడవునా పండిస్తారు. అయితే చాలా మంది ...