భారతదేశం, ఆగస్టు 11 -- అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని యంత్రాంగం వలసదారులపై కఠిన చర్యలను మరింత వేగవంతం చేసింది. దేశంలో నివసిస్తున్న విదేశీయులపై డేగకన్ను ఉంచిన ప్రభుత్వం, ఇప్పటివరకు 1,75,000 కంటే ఎక్కువ వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ సోమవారం అధికారికంగా వెల్లడించింది.

విదేశీయులు వీసా నిబంధనలను ఉల్లంఘించడం, చట్టవ్యతిరేక నేరాలకు పాల్పడటం, అమెరికన్ పౌరులపై హింసను ప్రేరేపించడం, మోసాలకు పాల్పడటం, ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను దుర్వినియోగం చేయడం, జాతీయ భద్రతకు విఘాతం కలిగించడం వంటి కారణాలతోనే ఈ వీసాలను రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

శాంతిభద్రతల పరిరక్షణ సంస్థలు (Law Enforcement) చేపట్టిన తనిఖీల్లోనే అత్యధిక శాతం వీసా రద్దులు చోటు చేసుకున్నాయి. భౌతిక దాడులు, మద్యం సేవించి వాహనాలు నడపడం (DUI), దొంగతనాలు, డ్రగ్స్ స...