భారతదేశం, మార్చి 23 -- పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లను కుదిపేస్తున్నాయి. యుద్ధ భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తం కావడంతో సోమవారం (మార్చి 23) బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. గత వారం రోజులుగా పసిడి ధరలు క్షీణిస్తూనే ఉండటం గమనార్హం. 1983 తర్వాత బంగారం అత్యంత దారుణమైన వారపు పతనాన్ని చవిచూసింది.

అంతర్జాతీయ మార్కెట్ (COMEX)లో సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే బంగారం ధర 3 శాతం మేర క్షీణించి, ఔన్స్‌కు 4,462 డాలర్ల వద్దకు చేరుకుంది. అటు వెండి ధర కూడా ఆసియా ట్రేడింగ్ సమయంలో 3 శాతం పడిపోయి, ఔన్స్‌కు 67.5 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. యుద్ధం వస్తే పెరగాల్సిన బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయనేది ఇప్పుడు సామాన్య ఇన్వెస్టర్లలో తలెత్తుతున్న ప్రధాన ప్రశ్న.

సాధారణంగా యుద్ధ సమయాల్లో బ...