భారతదేశం, సెప్టెంబర్ 11 -- ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఒక భారతీయ విద్యార్థి దారి తప్పి జైలు పాలయ్యాడు. వృద్ధులను లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయల దగాకు పాల్పడిన కేసులో యూఎస్ ఫెడరల్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో నివసిస్తున్న 37 ఏళ్ల వెంకటేశ్వర చాగంరెడ్డికి 30 నెలల (రెండున్నరేళ్లు) జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.

బాధితుడికి 99,496 డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ.83 లక్షలు) నష్టపరిహారంగా చెల్లించాలని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జాన్ డి. రస్సెల్ ఆదేశించారు. జైలు శిక్ష, మూడేళ్ల పర్యవేక్షణ వ్యవధి (Supervised Release) పూర్తయిన తర్వాత వెంకటేశ్వర చాగంరెడ్డిని అమెరికా నుంచి డిపోర్ట్ (దేశం నుంచి పంపించివేయడం) చేసే అవకాశాలు ఉన్నాయని యూఎస్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ (డీఓజే) తెలిపింది.

ఈ మోసం 2025 ఆగస...