భారతదేశం, జూలై 3 -- పుట్టిన గడ్డను, కన్నవారిని వదిలి విదేశాలకు వెళ్లే ప్రతి ఒక్కరి మనసులోనూ ఒక బలమైన కోరిక ఉంటుంది. ఎప్పటికైనా తాము కష్టపడి సంపాదించిన డబ్బుతో అమ్మానాన్నలను విదేశాలకు తీసుకెళ్లాలని, తాము నిర్మించుకున్న జీవితాన్ని వారికి దగ్గరుండి చూపించాలని ఆరాటపడతారు. సరిగ్గా ఇలాంటి ఒక పవిత్రమైన ఆశను నిజం చేసుకుంది భారతీయ యువతి అంకిత మిశ్రా. ఏకంగా 3,620 రోజులకు పైగా నిరీక్షించి, తన సొంత పొదుపు మొత్తంతో తల్లిదండ్రులను అమెరికా భూమిపై అడుగుపెట్టించింది.

ప్రస్తుతం అమెరికాలోని సీటెల్ నగరంలో గల ప్రసిద్ధ టెక్ సంస్థ 'అట్లాసియన్' (Atlassian) లో సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్న అంకిత, ఈ మధుర క్షణాలను లింక్డ్‌ఇన్ (LinkedIn) వేదికగా పంచుకుంది. విమానాశ్రయం అరైవల్ టెర్మినల్ వద్ద 'దీని కోసమే 3,620 రోజులకు పైగా వేచి చూశాను', 'అమెరికాకు స్వాగతం ...