భారతదేశం, ఏప్రిల్ 12 -- హైదరాబాద్ న‌గ‌ర చ‌రిత్రలో నిలిచిపోయే భారీ ఆప‌రేష‌న్‌ను ప్రభుత్వ యంత్రాంగం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో నిర్వహించింది. గ‌తంలో ఎన్నడూ లేని విదంగా 861 ఎక‌రాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ, మున్సిప‌ల్, పోలీసు అధికారుల‌తో క‌లిసి హైడ్రా కాపాడింది. ఈ భూమి విలువ‌ మార్కెట్లో రూ. 15 వేల కోట్లకు పైగా ఉంటుంద‌ని అంచ‌నా.

భారీ పోలీసు బందోబ‌స్తు మ‌ధ్య హైడ్రా, రెవెన్యూ, మున్సిప‌ల్ శాఖ‌ల‌తో పాటు ఇత‌ర విభాగాలు ఈ ఆప‌రేష‌న్‌ను నిర్వహించాయి. ఇప్పటికే ఇల్లు క‌ట్టుకుని ఉన్న వారిని మిన‌హాయించి ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఇల్లు క‌ట్టుకున్నపేదలు, సామాన్యులు ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌ని ఎప్పటిక‌ప్పుడు మైకులో అధికారులు మైకు ద్వారా ప్రక‌టించారు. దీంతో పేద‌లంతా ఊపిరి పీల్చుకున్నారు.

హైడ్రా ఫెన్సింగ్ కార్యక్రమానికి స‌హ‌క‌రించా...