అమరావతిలో రివర్ ఫ్రంట్ టూరిజం.. పీపీపీ విధానంలో అమ్యూజ్మెంట్, ఎకో పార్కుల అభివృద్ధి!
భారతదేశం, జూలై 17 -- ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతిని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా అమరావతి రివర్ ఫ్రంట్ టూరిజం ప్రాజెక్టులపై మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ ఏడీసీఎల్ అధికారులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాజధాని ప్రాంతంలో పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు, భవిష్యత్తు ప్రణాళికలపై అధికారులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ విధానంలో భారీ ప్రాజెక్టులను చేపట్టనున్నారు.
రాజధానిలో ప్రధాన రహదారులు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలు పూర్తి కావడానికి సమాంతరంగానే.. ఈ టూరిజం ప్రాజెక్టులను కూడా అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. ముఖ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.