భారతదేశం, మార్చి 2 -- కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం బ్యారేజీలో చేస్తున్న ఇసుక తవ్వకాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మేడిగడ్డ బ్యారేజీపై కుట్రలు చేసింది చాలదన్నట్టు. అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుతంత్రాలకు తెరతీశారా.? ప్రశ్నించారు.

నిబంధనలకు పాతరేసి ఏకంగా బ్యారేజీ కిందే భారీ ఎక్సవేటర్లతో ఇసుక తవ్వకాలు జరపడం దుర్మార్గమే కాదు.. అతిపెద్ద నేరమని కేటీఆర్ అన్నారు. బ్యారేజీ సమీపంలో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదన్న రూల్స్ ను బ్రేక్ చేసిన మాఫియాపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

"ఏకంగా బ్యారేజీని బలహీనపరిచి బీఆర్ఎస్ పై బురదజల్లే పన్నాగాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలి. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసేందుకు నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ చే...