భారతదేశం, మార్చి 10 -- దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan) పథకం 22వ విడత నిధులను మార్చి 13న విడుదల చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది. అస్సాంలోని గౌహతి వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిజిటల్ పద్ధతిలో ఒకే క్లిక్‌తో సుమారు రూ.19,000 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనున్నారు. ఈ విడత ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 9.32 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.

ప్రస్తుతం ఖరీఫ్ సాగు సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ నిధులు రైతులకు ఎంతో కీలకమని చెప్పాలి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వంటి సాగుకు అవసరమైన ముడి పదార్థాల కొనుగోలుకు ఈ నగదు సాయం ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

సాధారణంగా ప్రభుత్వం ఏటా మూ...