భారతదేశం, ఏప్రిల్ 25 -- ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు భారత్‌ను ఆందోళనలోకి నెడుతున్నాయి. ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. మే నుంచి జూలై మధ్యలో 'ఎల్ నినో' పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) తాజాగా వెల్లడించింది. దీనివల్ల 2026లో భారత్ కరువు కోరల్లో చిక్కుకునే ప్రమాదం ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. కేవలం వర్షాలు తగ్గడమే కాకుండా, సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదై జనం ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

పసిఫిక్ మహాసముద్రం మధ్య, తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరగడాన్నే ఎల్ నినో అంటారు. ఇది వినడానికి చిన్న మార్పులా అనిపించినా, ప్రపంచవ్యాప్తంగా గాలి మళ్లింపును, వర్షపాత గమనాన్ని పూర్తిగా మార్చేస్తు...