భారతదేశం, సెప్టెంబర్ 13 -- ఇటీవలే చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల మధ్య వరంగల్ రాజకీయం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. రాష్ట్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన తర్వాత కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి తమ భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఇందులో భాగంగానే కొండా దంపతులు వరంగల్ నగరంలో తమ అనుచరులు, పార్టీ ముఖ్య కార్యకర్తలతో ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు.

వాస్తవానికి ఈ సమావేశాన్ని వరంగల్‌లోని కొండా సురేఖ నివాసం వద్ద నిర్వహించాలని భావించారు. అయితే, నగరంలో కురుస్తున్న వర్షం కారణంగా వేదికను మార్చాల్సి వచ్చింది. వర్షం తగ్గకపోవడంతో కార్యకర్తల భేటీని సమీపంలోని ఓహోటల్‌కు మార్చారు. మంత్రి పదవి కోల్పోయిన తర్వాత కొండా దంపతులు తమ నియోజకవర్గ నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తలతో విస్తృత స్థాయిలో ముఖాముఖి భేటీ కావడం ఇదే తొలిసారి కావడంతో ఈ ...