భారతదేశం, జనవరి 15 -- సంక్రాంతిని సందర్భంగా విజయవాడ వెస్ట్ బైపాస్‌ను అందుబాటులోకి తెచ్చారు అధికారులు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలంలోని కాజా నుంచి కృష్ణా జిల్లాలోని పెదఅవుటపల్లికి వరకు నిర్మించిన విజయవాడ పశ్చిమ బైపాస్‌ను నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులు ప్రారంభించారు. కొత్తగా పూర్తయిన రహదారిని ఒక వైపు ప్రారంభించారు.

ప్రారంభోత్సవ వేడుకల సందర్భంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారులు పూజలు నిర్వహించారు. మెుదట NHAI అధికారుల వాహనాలు మాత్రమే బైపాస్‌ మీద నుంచి పంపించారు. ఆ తర్వాత ఇతర వాహనాలు కూడా అనుమతించారు.

మార్చి నాటికి మరోవైపు కూడా మార్గాన్ని తెరుస్తామని అధికారులు ప్రకటించారు. గుంటూరు వైపు నుండి వచ్చే వాహనాలు నేరుగా రాజధానికి చేరుకోవడానికి ఏర్పాట్లు చేసినట్లు కూడా ధృవీకరించారు. మొత్తం రోడ్డు పూర్తిగా పనిచేసిన తర్వాతే వెంకట...