భారతదేశం, మే 11 -- తెలంగాణ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' విద్యా వారోత్సవాల వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సంచలన నిర్ణయాలను ప్రకటించారు. విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని నమ్ముతూ, ఈ శాఖను తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు సీఎం వెల్లడించారు.

విద్యా వ్యవస్థ బలోపేతం కోసం రూ.1,100 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. విద్యాశాఖకు కేటాయించే నిధులను 15 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చారు. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా విధానం ఉన్న ఫిన్లాండ్‌కు ఇప్పటికే 25 మంది టీచర్లను అధ్యయనం కోసం పంపించామని, అవసరమైతే మరిన్ని దేశాలకు పంపిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.

'విద్యావ్యవస్థలో తెలంగాణ ప్రాంతం దశాబ్దాలుగా వివక్షకు గురైనది. వివక్షతో 196...