భారతదేశం, జనవరి 22 -- అమరావతికి రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధత కల్పించే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి మార్గం సుగమం చేసింది కేంద్రం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, ఇతర సంబంధిత కేంద్ర విభాగాలు కోరిన అవసరమైన వివరాలు, స్పష్టతలను సమర్పించినట్టుగా తెలుస్తోంది. ఈ సంబంధిత బిల్లును పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం చూస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక పార్లమెంటు సభ్యుడి ప్రకారం.. జనవరి 28న ప్రారంభం కానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ముగింపు నాటికి ఈ ప్రతిపాదిత చట్టం ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.

ఈ బిల్లు 2014 నాటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణ చేయడానికి ఉద్దేశించబడింది. ఆ చట్టంలో హైదరాబాద్ పదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా పేర్కొన్నారు. ఈ గడువు జూన్ 2...