భారతదేశం, ఫిబ్రవరి 24 -- అండమాన్ నికోబార్ దీవుల్లో మంగళవారం ఉదయం పెను విమాన ప్రమాదం తప్పింది. జాతీయ హెలికాప్టర్ రవాణా సంస్థ 'పవన్ హన్స్'కు చెందిన ఓ హెలికాప్టర్ సముద్రంలోకి దూసుకెళ్లింది. అయితే, అదృష్టవశాత్తూ విమానంలో ఉన్న ఏడుగురు ప్రాణాలతో బయటపడ్డారు.

మంగళవారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు సిబ్బంది, ఐదుగురు ప్రయాణికులతో కూడిన పవన్ హన్స్ హెలికాప్టర్ పోర్ట్ బ్లెయిర్ నుంచి ఉత్తర అండమాన్‌లోని మాయాబందర్‌కు బయలుదేరింది. గమ్యస్థానానికి చేరుకుని, ల్యాండ్ కావడానికి మరికొన్ని సెకన్ల సమయం ఉందనగా ప్రమాదం జరిగింది. రన్‌వేకు కేవలం 300 మీటర్ల దూరంలో ఉండగా హెలికాప్టర్ అదుపుతప్పి సముద్రంలో పడిపోయింది.

ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్లు పవన్ హన్స్ ప్రతినిధి వెల్లడించారు. "హెలికాప్టర్ సముద్రంలో పడిపోయినప్పటికీ (Ditching...