భారతదేశం, ఏప్రిల్ 8 -- బాలీవుడ్ హీరోయిన్, తెలుగు చాణక్య ఫేమ్ జరీన్ ఖాన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తల్లి పర్వీన్ ఖాన్‌ బుధవారం (ఏప్రిల్ 8) తుదిశ్వాస విడిచారు.

హిందీ సినిమా 'వీర్' ద్వారా సల్మాన్ ఖాన్ సరసన వెండితెరకు పరిచయమైన జరీన్ ఖాన్ తల్లి పర్వీన్ ఖాన్‌ మరణం చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. గత కొన్ని ఏళ్లుగా ఆమె తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా 2016లో పర్వీన్ ఖాన్‌కు గుండె శస్త్రచికిత్స జరిగినప్పటి నుంచి ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. పరిస్థితి విషమించడంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పర్వీన్ ఖాన్ కన్నుమూశారు.

"మా ప్రియతమ పర్వీన్ ఖాన్ (జరీన్ ఖాన్, సనా ఖాన్‌ల తల్లి) ఏప్రిల్ 8న శాంతియుతంగా స్వర్గస్తులయ్యారని తెలియజేయడానికి చింతిస్తున్నాం" అని జరీన...