భారతదేశం, జూలై 23 -- Yuvraj Singh On Delhi Protest: దేశ రాజధాని ఢిల్లీని విద్యార్థి ఉద్యమం కుదిపేస్తోంది. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తేవాలని, ప్రస్తుత లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) నేతృత్వంలో వేలాది మంది విద్యార్థులు, మద్దతుదారులు రోడ్లపైకి వచ్చారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ చేపట్టిన ఈ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. జంతర్ మంతర్ వద్ద వేలాది మంది విద్యార్థులు బైఠాయించారు. ఈ ఆందోళనలపై భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.

యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇరు వర్గాలు పట్టువిడుపులు ప్రదర్శించాలని యువరాజ్ కోరారు. హింసతో ఏదీ సాధించలేమని, శాంతియుత చర్చలే పరిష్కార మార్గమని ఆయన అభిప్రాయప...